News September 11, 2025
NRPT: లారీ ఢీకొని 26 గొర్రెలు మృత్యువాత

కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి-44పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన గొర్రెల కాపరితో పాటు 26 గొర్రెలు మృతిచెందాయి. మృతుడు మరికల్కు చెందిన గుడికండ్ల రామప్పగా, గాయపడిన మరో గొర్రెల కాపరి బసాయిల మల్లేష్గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. వీరు కామారెడ్డి జిల్లాలో గొర్రెలను మేపడానికి వెళ్లగా బుధవారం ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News December 7, 2025
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

నరసరావుపేటలో గత వారంతో పోలిస్తే ఈ ఆదివారం కేజీ చికెన్ ధర రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. లైవ్ కోడి కేజీ రూ. 135 ఉంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ రూ. 240-280 ఉండగా స్కిన్తో రూ. 230-260 లభిస్తుంది. మటన్ కేజీ ధర రూ. 800-900 అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్లు రూ. 670 అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
సంగారెడ్డి: బాబోయ్.. మళ్లీ చలి

ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ చలిపంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా కోహీర్ మండలంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట(D) అంగడికిష్టాపూర్లో 10.6 డిగ్రీలు, మెదక్(D) నార్లాపూర్లో 11.2 డిగ్రీలు నమోదయ్యాయి. చల్ల గాలుల ప్రభావంతో రానున్న పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 7, 2025
భద్రకాళి అమ్మవారి నేటి దివ్య దర్శనం

వరంగల్ కొంగు బంగారమైన శ్రీ భద్రకాళి ఆలయంలో ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేషమైన అలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. నేడు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


