News March 5, 2025

NTR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య ఇదే

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26,679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్‌లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.

Similar News

News December 15, 2025

ఒక్క ఓటుతో కొత్తపల్లి సర్పంచ్‌గా గెలిచిన శోభారాణి

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా గోదరి శోభారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శోభారాణి తన ప్రత్యర్థి ఎల్కతుర్తి కనకలక్ష్మిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

News December 15, 2025

వలిగొండలో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.. గెలిచిందెవరంటే?

image

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకట పాపిరెడ్డి ప్రత్యర్థి BRS బలపరిచిన పలుసం రమేశ్ గౌడ్‌పై 472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచాలు, మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 7,212 ఓట్లు ఉండగా కాంగ్రెస్, BRS మధ్య నెక్ టూ నెక్ ఫైట్ సాగింది.

News December 15, 2025

నవాబ్‌పేట్‌లో గెలుపొందిన సర్పంచ్‌లు వీళ్లే..

image

వట్టిమీనపల్లి- సుక్కమ్మొళ్ళ మాణెమ్మ (బీఆర్‌ఎస్‌)
మూలమాడ – కందాడ స్వాతి (బీఆర్‌ఎస్‌)
అత్తాపూర్‌ -మేకల సంతోష్‌రెడ్డి (కాంగ్రెస్‌)
ఎక్‌మామిడి – మహిళ నర్మద (కాంగ్రెస్‌)
ఎత్‌రాజ్‌పల్లి – మల్గారి జగన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)
చించల్‌పేట – -గుడిసె అనుసూజ (కాంగ్రెస్‌)
ముబారక్‌పూర్‌ ఎస్సీ జనరల్‌ జామ జేజయ్య (స్వతంత్ర)