News September 13, 2025

NTR: ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్.. అప్లై చేసుకోండి

image

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేంద్రం అందించే NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోపు https://portal.bseap.org/APNMMSTFV/Account/Login.aspxలో దరఖాస్తు చేసుకోవచ్చు. 180 మార్కులకు పరీక్ష నిర్వహించి..అందులో ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం అందిస్తుందని NTR జిల్లా DEO యూవీ సుబ్బారావు తెలిపారు.

Similar News

News December 11, 2025

15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి

image

నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.

News December 11, 2025

అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

image

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.

News December 11, 2025

పదేళ్ల తర్వాత జాతీయ స్థాయి పోటీలు: రాంప్రసాద్ రెడ్డి

image

AP: రాష్ట్రంలో పదేళ్ల తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యోనెక్స్-సన్‌రైజ్ 87వ జాతీయ పోటీల పోస్టర్‌ను CM చంద్రబాబు ఆవిష్కరించగా ఆయన్ను ప్రారంభోత్సవానికి మంత్రి ఆహ్వానించారు. DEC 24-28వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని CMకు వివరించారు.