News September 10, 2025

NTR: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన ఎం.కామ్ 1, 3వ, ఎం.ఏ. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News December 5, 2025

సిద్దిపేట: కలెక్టర్‌ను కలిసిన స్వయం సహాయక సభ్యులు

image

స్వయం సహాయక సంఘా సభ్యులు Event Management పై National Institute of Tourism and Hospitality Management(NITHM) హైదరాబాద్‌లో 5 రోజులు పాటు శిక్షణ తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఆరుగురు స్వయం సహాయక సభ్యులు బాలలక్ష్మి, మంజుల, శ్వేతాకళ, భూలక్ష్మి, శిరీష, లావణ్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి పలు రకాల యూనిట్లకు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు.

News December 5, 2025

సిద్దిపేట: ఉమిద్ పోర్టల్‌లో ఆస్తుల నమోదు

image

ఉమిద్ పోర్టల్‌లో ఎండోమెంట్ ఆస్తుల నమోదును ప్రక్రియ సిద్దిపేట జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉమిద్ పోర్టల్‌పై నెల రోజుల నుంచి సిద్ధిపేట అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ సలాం ఖాస్మి చుట్టుపక్కల మండలాల ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల యువత, నాయకులు తమ వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తి పత్రాలను పోర్టల్‌లో నమోదు చేశారు.

News December 5, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

image

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.