News February 8, 2025

NZB: అప్పుల బాధతో వాచ్‌మెన్ ఆత్మహత్య

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4 టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. నవీపేటకు చెందిన రేపన్ శంకర్ (58) ఎల్లమ్మ గుట్టలోని అమ్మ వెంచర్‌లో వాచ్మెన్‌గా పనిచేస్తున్నారు. కూతురు పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చలేక మనోవేదనకు గురై రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్‌అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

News February 12, 2026

NZB: పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతంలో ఓటేశారు

image

నిజామాబాద్ కార్పొరేషన్ సహా ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చైతన్యం చాటారు. పురుషుల ఓటింగ్ శాతం 60.86% కాగా, మహిళలు 62.87% పోలింగ్‌తో పైచేయి సాధించారు. మొత్తం 2,57,020 మంది మహిళా ఓటర్లలో 1,61,597 మంది ఓటు వేయగా.. 2,38,418 మంది పురుషుల్లో కేవలం 1,45,098 మంది మాత్రమే ఓటేశారు. పురుషుల కంటే మహిళలే ఓటింగ్ నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు.

News February 12, 2026

14న ఆర్మూర్ ఆర్టీసీ కార్గోలో వేలం

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిల్ సర్వీస్‌లో మిగిలిన పాత వస్తువులకు ఈనెల 14న శుక్రవారం వేలం పాట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేలంపాట జరుగుతుందని డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు పాల్గొని అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.