News January 19, 2025
NZB: నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం NZB రానున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసి గూపన్పల్లిలో, నగరంలో బహిరంగ సభల్లో మాట్లాడి హైదరాబాద్ తిరుగపయనమవుతారు.
Similar News
News February 16, 2025
NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఐఈఓ

నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యశాఖ అధికారి రవికుమార్ తనిఖీ చేశారు. అదేవిధంగా జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్, కనకమహాలక్ష్మి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మరో 12 కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా డీఐఈఓ పరిశీలించారు.
News February 16, 2025
NZB: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

NZB, ADB, KNR, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
News February 16, 2025
KMR: అప్పుల బాధ..ఒకే రోజు ఇద్దరి సూసైడ్..!

గాల్లో దీపాల్లా..వ్యక్తుల జీవితాలు మారిపోయాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ..ఆ కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో నర్సింలు సూసైడ్ చేసుకోగా..కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక బుడ్మి వాసి జీవన్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.