News June 19, 2024
NZB: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డ్ను రద్దు చేసి 24 లక్షల నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ NSUI, AISF, SFI, PDSU, PDSU, AIPSU విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో బుధవారం నిజామాబాద్లో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
Similar News
News January 17, 2026
నిజామాబాద్లో సైబర్ మోసం

NZB పూసలగల్లి వాసి ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News January 17, 2026
NZB: మందుగుండు పేలి ఆవు మృతి

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.
News January 17, 2026
NZB: ఆశవాహుల్లో ఉత్కంఠ

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.


