News April 4, 2024
NZB: రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం యువతే: సీపీ

యువత మద్యం తాగి వాహనాలు నడపరాదని, గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలలో యువతే అత్యధికంగా ఉన్నారని నిజమాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం పేర్కొన్నారు. కాగా 2023లో మొత్తం 767 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 337మంది మరణించారు. మార్చ్(2024)నెలలో 649 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 267మందికి జైలుశిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ సూచించారు.
Similar News
News February 11, 2026
NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్లో 162 మంది, ఆర్మూర్లో 153 మంది, భీంగల్లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
News February 10, 2026
NZB: మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాల వివరాలివే!

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల కోసం పంపిణీ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగరం కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బోధన్కు విజయ మేరీ హైస్కూల్, ఆర్మూర్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు భీంగల్కు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 10, 2026
NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.


