News February 27, 2025

NZB: గోదావరిలో మునిగి యువకుడి మృతి

image

శివరాత్రి రోజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానం కోసం వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందినట్లు బోధన్ రూరల్ సీఐ విజయబాబు తెలిపారు. బోధన్‌కు చెందిన వర్ధన్, తన మిత్రుడు విగ్నేశ్‌తో కలిసి బుధవారం రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదిలో స్నానం కోసం వెళ్ళాడు. వర్ధన్ నీటిలో గల్లంతయ్యాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం లభ్యమైనట్లు విజయ్ బాబు తెలిపారు.

Similar News

News February 27, 2025

NZB: 17న మిస్సింగ్ 26న మృతదేహం లభ్యం

image

ఈ నెల 17 నుంచి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు NZB 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాలు.. NZB కోటగల్లీకి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(48) ఈ నెల డ్రైవింగ్‌పై కుంభమేళాకు వెళ్లి 17న తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా కనిపించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన మృతదేహం నవీపేట్ గాంధీనగర్ శివారులో లభ్యమైనట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

News February 27, 2025

భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తన తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.

News February 27, 2025

నందిపేట్: దుబాయిలో ఉద్యోగాల పేరిట మోసం

image

నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో గల్ఫ్ ఏజెంట్ కస్పా శ్యామ్, మధు, సాయి రెడ్డి, గుడ్ల ప్రకాష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయిలాపూర్ గ్రామానికి చెందిన ఏజెంట్ కస్పా శ్యామ్ దుబాయిలో ఉద్యోగాల పేరిట తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. నలుగురు దాడి చేశారని అమలాపురానికి చెందిన బాధితుడు నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

error: Content is protected !!