News April 21, 2024
రేపు ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం

AP: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే వీటన్నిటికన్నా ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం. ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట క్షేత్రంలో రేపు రాములోరి కళ్యాణం జరుగుతుంది. సా.6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహిస్తారు. కోదండరాముడి కళ్యాణోత్సవం కోసం తూ.గో జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు 180 కిలోల తలంబ్రాలను అందజేశారు.
Similar News
News December 16, 2025
రేపు క్లాట్ ఫలితాలు

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు రేపు 10AMకు విడుదల కానున్నాయి. https://consortiumofnlus.ac.in/ నుంచి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా డిసెంబర్ 7న జరిగిన పరీక్షకు దాదాపు 92వేల మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలలో UP, PG ప్రోగ్రాముల్లో సీట్లు కేటాయిస్తారు.
News December 16, 2025
చియా ఫేస్ప్యాక్తో ముఖానికి మెరుపు

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.
News December 16, 2025
దేవాలయాలకు వీటిని తీసుకెళ్తున్నారా?

గుడిలోకి ప్రవేశించేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించడం, తీసుకువెళ్లడం శుభం కాదు. ఎందుకంటే తోలును చనిపోయిన జంతువుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి అవి అపవిత్రమైన పదార్థాల కోవకు చెందుతాయి. పాదరక్షలు, బెల్టులు, పర్సులు వంటి తోలు వస్తువులతో ఆలయంలోకి వెళ్లడం దేవతలను అగౌరవపరచడం అవుతుంది. ఆలయ పరిశుద్ధత కాపాడటానికి భక్తులు ఆలయానికి ఇవేం తీసుకురాకుండా పరిశుభ్రమైన మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.


