News April 25, 2024

ఏపీ విద్యార్థులకు జూన్ 2 వరకే అవకాశం: TG విద్యాశాఖ

image

AP విభజన చట్టం ప్రకారం ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు జూన్ 2తో ముగియనుందని, ఆలోగా TGలో జరిగే ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత TG వారికే స్థానికత వర్తిస్తుందని, జూన్2 తర్వాత పరీక్షలు రాసే AP విద్యార్థులకు రిజర్వేషన్లు ఉండవని తెలిపింది.

Similar News

News April 16, 2026

రేపు ప.గో జిల్లాలో అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

image

భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

News April 16, 2026

LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 16, 2026

సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

image

TCS నాసిక్‌లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.