India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: డిప్యూటీ CM పవన్ సోదరుడు నాగబాబు రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఆయన్ను MLCగా, మంత్రిగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామా చేయగా ఖాళీ అయిన స్థానంలో నాగబాబును బరిలోకి దించే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా తమ అభ్యర్థిని పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం.

కిడ్నాప్, చోరీ, మర్డర్ లాంటి ఘటనలు జరగకుండా మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తే పలు రంగాలకు రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనేక కుటుంబాలు లాభపడ్డాయని తెలిపారు. ఓ ఫ్యామిలీ 130 బోట్లను నడిపిస్తూ రూ.30కోట్లు సంపాదించిందని పేర్కొన్నారు. రోజుకు ఒక్కో బోటు నుంచి రూ.52వేలు లాభం పొందిందని ఓ సక్సెస్ స్టోరీని వివరించారు.

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.

TG: MLAల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా BRS అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. MLAల సంఖ్యా పరంగా BRSకు ఒక స్థానం కచ్చితంగా దక్కనుండగా, రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటింగ్ తప్పనిసరి కానుంది. దీంతో పార్టీ మారిన 10 మంది MLAల ఓటు కీలకం కానుంది. వీరిని ఇరుకున పెట్టాలని KCR భావిస్తున్నారు.

మెక్సికో, కెనడాపై విధించిన భారీ సుంకాల విషయంలో స్వల్ప మార్పులు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ దేశాల విజ్ఞప్తుల్ని పరిగణించి టారిఫ్లను కొంత మేర తగ్గించొచ్చని US వాణిజ్య మంత్రి హొవార్డ్ లుత్నిక్ తెలిపారు. మరోవైపు.. తమ దేశాన్ని ఆక్రమించాలన్న ప్రణాళికతోనే ట్రంప్ భారీగా సుంకాల్ని విధించారని కెనడా PM జస్టిన్ ట్రూడో ఆరోపించడం గమనార్హం.

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, HMDA పరిధిని రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించడం సహా మరికొన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా సమాలోచనలు చేసే అవకాశం ఉంది.

AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిడమర్రు (మంగళగిరి) స్కూల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడిస్తారు. ఏ విద్యార్థికి ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో అందులో శిక్షణ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మార్చడమే లక్ష్యమన్నాయి.

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL సీజన్లో BCCI కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్లేయర్లు, స్టాఫ్ కుటుంబసభ్యులను డ్రెస్సింగ్ రూమ్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్లేయర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ సెషన్లకు జట్టు బస్సులోనే ప్రయాణించాలని పేర్కొంది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో స్లీవ్లెస్ జెర్సీలను ధరించొద్దని తెలిపింది. రూల్స్ ఉల్లంఘిస్తే తొలుత వార్నింగ్, తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.

AP: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల కోసం వీటిని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు సీఎంవో ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.