News January 27, 2025

Stock Market: నేలచూపులు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు Mon భారీగా న‌ష్ట‌పోయాయి. Sensex 824 PTS న‌ష్ట‌పోయి 75,366 వ‌ద్ద‌, Nifty 263 PTS ప‌త‌న‌మై 22,829 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఫార్మా, రియ‌ల్టీ రంగాలు నేల‌చూపులు చూశాయి. India Vix 18.14గా న‌మోద‌వ్వ‌డం కీల‌క రంగాల్లో అమ్మ‌కాల ఒత్తిడిని ప్ర‌తిబింబిస్తుంది. Britannia, ICICI, M&M టాప్ గెయినర్స్. HCL, TechM, Wipro టాప్ లూజర్స్.

News January 27, 2025

బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?: ఎంపీ కిరణ్

image

TG: బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. <<15279303>>బండి వ్యాఖ్యలు<<>> హాస్యాస్పదమన్నారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి పేరును అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని కౌంటర్ ఇచ్చారు.

News January 27, 2025

ప్రజల అంచనాల మేరకు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

image

AP: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పింఛన్లు, దీపం పథకం, అన్న క్యాంటీన్, ఇసుక సరఫరాతోపాటు ఉద్యోగుల తీరుపై ఆయన ఆరా తీశారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో వారి అంచనాల మేరకు పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు.

News January 27, 2025

అతనికి మ‌ర‌ణశిక్ష విధించాలన్న పిటిషన్ల స్వీకరణపై తీర్పు రిజర్వ్

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో దోషి సంజ‌య్ రాయ్‌కు మ‌ర‌ణశిక్ష విధించాల‌ని దాఖ‌లైన పిటిషన్ల స్వీకరణపై కలకత్తా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దోషికి ట్ర‌య‌ల్ కోర్టు విధించిన జీవిత‌ ఖైదు స‌రిపోద‌ని బెంగాల్ ప్ర‌భుత్వం, CBI కోర్టుకెక్కాయి. తీర్పును స‌వాల్ చేసే అర్హ‌త త‌మ‌కు త‌ప్ప‌ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని CBI వాదించింది. వాద‌న‌లు విన్న న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది.

News January 27, 2025

రంజీలకు సిద్ధమైన రాహుల్, సిరాజ్, పరాగ్

image

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న హరియాణా మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని రాహుల్ కర్ణాటక జట్టుకు సమాచారమిచ్చారు. అటు హైదరాబాద్ తరఫున సిరాజ్, అస్సాం తరఫున రియాన్ పరాగ్ ఆడనున్నారు. మరోవైపు రైల్వేస్‌తో ఆడేందుకు ఢిల్లీ జట్టును ఇవాళ సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్, పంత్ తదితరులు రంజీ మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే.

News January 27, 2025

త్రివిక్రమ్ టార్చర్ వల్లే అన్నీ ఆపేశా: పూనమ్ కౌర్

image

డైరెక్టర్ త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి ఆరోపణలు చేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆమె ‘జై బాలయ్య’ అని ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. దీనికి కామెంట్ బాక్స్‌లో ఓ నెటిజన్ ‘మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. పూనమ్ అతడికి రిప్లై ఇస్తూ ‘అప్పట్లో సినిమాలు చేసేదాన్ని. కానీ త్రివిక్రమ్, గ్రూప్స్(టాలీవుడ్‌లో గ్రూపిజాన్ని ఉద్దేశించి) టార్చర్ వల్ల అన్నీ ఆపేశా’ అని చెప్పారు.

News January 27, 2025

ముడా స్కామ్‌లో ముఖ్యమంత్రి భార్యకు ఈడీ నోటీసులు

image

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) భూముల స్కామ్ దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ CM సిద్దరామయ్య భార్య పార్వతికి, మంత్రి సురేశ్‌కు నోటీసులు జారీ చేసింది. ముడా భూముల కేటాయింపులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత అక్టోబరులో ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య దంపతులతో పాటు సీఎం బావమరిది బీఎం మల్లికార్జున స్వామి ఇందులో నిందితులుగా ఉన్నారు.

News January 27, 2025

వరకట్న నిషేధం, గృహహింస చట్టాల దుర్వినియోగం పిల్ తిరస్కరణ

image

వరకట్న నిషేధం, గృహహింస చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకొనేలా సంస్కరణలు కోరుతూ వేసిన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని, పార్లమెంటుకే ఆ అధికారం ఉందని జస్టిస్ BV నాగరత్న, జస్టిస్ SC శర్మ బెంచ్ అభిప్రాయపడింది. ఇప్పటికే కోర్టులపై కేసుల భారం పెరిగిందని, కొత్తగా ఇలాంటివి వద్దని సూచించింది. లాయర్లు ఈ కేసుల్లో లిటిగెంట్స్ కావొద్దని పిటిషనర్ విశాల్‌ను ఆదేశించింది.

News January 27, 2025

ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి

image

2024కు గాను ICC ఉమెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత ప్లేయర్ స్మృతి మంధాన సొంతం చేసుకున్నారు. ఆమె రెండోసారి ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం. గత ఏడాది స్మృతి 13 ఇన్నింగ్స్‌లలో 747 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలున్నాయి. ఇక ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా సాధించారు. ఈయన 14 మ్యాచ్‌లలో 417 రన్స్‌తో పాటు 17 వికెట్లను పడగొట్టారు.

News January 27, 2025

‘అందరికీ ఇళ్లు’.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

APలో ‘అందరికీ ఇళ్లు’ పథకం పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుండగా, స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్‌కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుండగా, రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.