News October 4, 2025
పోర్టు కట్టమని USని కోరిన పాక్!

ఇటీవలే వారి దేశంలో భూఖనిజాలు తవ్వేందుకు US కంపెనీతో ఒప్పందం చేసుకున్న పాక్.. ఇప్పుడు పోర్టు కట్టేందుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సలహాదారులు ఈ విషయంలో వైట్ హౌజ్ని సంప్రదించినట్లు సమాచారం. బలూచిస్థాన్లోని గ్వాదర్ జిల్లా పాస్నిలో పోర్టు నిర్మించి నడపాలని US ఇన్వెస్టర్స్ భావిస్తున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. ఖనిజాల రవాణాకు దీనిని వాడతారని తెలుస్తోంది.
Similar News
News January 14, 2026
BJPలోకి హరీశ్ అని ప్రచారం.. ఖండించిన BRS

TG: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే హరీశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారని ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ కమలం గూటికి వెళ్లబోతున్నారని అందులో ఉంది.
News January 13, 2026
పవన్ కళ్యాణ్కు మోదీ అభినందన

AP: జపనీస్ <<18828407>>కత్తిసాము<<>> కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను PM మోదీ ప్రశంసించారు. ‘ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఫిట్ ఇండియాకు ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News January 13, 2026
తల్లిదండ్రుల అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలి: SC

తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి డబ్బును పిల్లలు తిరస్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BV నాగరత్న కోరారు. ‘తమ తల్లిదండ్రులు ఆదాయానికి మించి సంపాదించిన దేన్నైనా పిల్లలు తీసుకోకూడదు. వాటికి లబ్ధిదారులుగా ఉండొద్దు. ఇది దేశానికి చేసిన గొప్ప సేవ అవుతుంది’ అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏకు చట్టబద్ధతపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


