News May 7, 2025
పాక్ నేవీ విన్యాసాలు.. భారత్కు పరోక్ష వార్నింగ్!

భారత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కరాచీ సమీపంలోకి చేరుకున్న నేపథ్యంలో పాక్ పరోక్ష హెచ్చరికలు చేసింది. అరేబియా సముద్రంలో ఈరోజు, రేపు తమ నౌకాదళం విన్యాసాలు చేయనుందని, వీటిలో క్షిపణి పరీక్షలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ సమయంలో నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అటు ఏ మిషన్కైనా నౌకలు సిద్ధంగా ఉన్నాయంటూ భారత నేవీ పోస్ట్ వేయడం గమనార్హం.
Similar News
News February 13, 2026
శ్రీవారి విషయంలో తప్పు చేయను: చంద్రబాబు

AP: తిరుమల శ్రీవారి విషయంలో తెలిసి కానీ, తెలియకుండా కానీ ఏ తప్పు చేయనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి రాష్ట్రంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఆయనను తలుచుకుంటే హాయిగా నిద్ర వస్తుందని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ సున్నితమైన అంశమని, దానిపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నానని చెప్పారు. అయితే కొంత మంది కావాలనే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అసెంబ్లీలో మండిపడ్డారు.
News February 13, 2026
ఓట్ల కోసం బోరున ఏడ్చిన BJP అభ్యర్థి.. రిజల్ట్ ఇదే

TG: ‘ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ <<19103865>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న యాదగిరిగుట్ట 9వ వార్డు BJP అభ్యర్థి ఉమ్మగండి రాజమణి ఓడిపోయారు. ‘దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఓటెయ్యండి’ అంటూ ఆమె బోరున విలపించిన తీరు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. నేటి ఫలితాల్లో 10 ఓట్లు మాత్రమే వచ్చినా రాజమణి నిరాశ చెందలేదు. డబ్బు, మద్యం తీసుకోకుండా బీజేపీకి ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
News February 13, 2026
స్వదేశీ ఆపిల్స్ను గుర్తించండిలా!

ఆరోగ్యానికి మేలు చేసే <<19126815>>స్వదేశీ<<>> ఆపిల్ పండ్లను ఇలా గుర్తించవచ్చు. స్వదేశీ ఆపిల్స్ సహజమైన రంగులో తక్కువ మెరుపుతో ఉంటాయి. వీటిపై విదేశీ రకాల వలె కృత్రిమ మైనం పూత ఉండదు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన రాయల్ డెలీషియస్, పసుపు రంగు గోల్డెన్ డెలీషియస్, కశ్మీర్ స్పెషల్ అంబ్రి రకాలు మన దేశంలో ప్రసిద్ధి. తాజాదనం, రుచి కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. share it


