News May 7, 2025
పాకిస్థానీలు రేపటిలోగా వెళ్లిపోవాలి: ఏపీ డీజీపీ

ఏపీలోని పాకిస్థానీలందరూ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రేపటి తర్వాత ఆ దేశస్థులు రాష్ట్రంలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు <<16214062>>తెలంగాణ డీజీపీ జితేందర్<<>> కూడా పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 16, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పతనమై రూ.1,43,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 16, 2026
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140+ పాయింట్ల లాభంతో 82,768 వద్ద కదలాడుతోంది. అటు నిఫ్టీ సైతం 42 పాయింట్ల లాభంతో 25,515 వద్ద ఊగిసలాడుతోంది.
News February 16, 2026
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

☛ పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి. ☛ పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ☛ కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.


