News May 7, 2025
పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి: DGP

పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి <<16211349>>అమిత్ షా<<>> ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, HYDలో 200 మంది పాకిస్థానీలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 13, 2026
ఫుట్వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

పాదాల రక్షణకు ఫుట్వేర్ అవసరం. అయితే చెప్పులు కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు . మీ సైజ్కు సరిపోయే చెప్పులే కొనాలి. టైట్/ లూజ్గా ఉంటే నడవడానికి ఇబ్బందవుతుంది. ఫుట్వేర్ స్టైల్తో పాటు ధరకి సరిపడా క్వాలిటీ ఉందో..లేదో చూసుకోవాలి. మీ అవసరాన్ని బట్టి రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ ఫుట్వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్ ఫుట్ వేర్ ఏ డ్రెస్కైనా మ్యాచ్ అవుతాయి.
News February 13, 2026
బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

బంగ్లాదేశ్లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.
News February 13, 2026
భగ్గుమంటున్న ధరలు

దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. JANలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా TGలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో AP ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.


