News June 17, 2024
పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత

ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ దేశం అమెరికాకు అప్పగించింది. ఇవాళ అతణ్ని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా అమెరికా గడ్డపై గురుపత్వంత్ హత్యకు నిఖిల్ మరొక భారత ఉద్యోగితో కలిసి ప్లాన్ వేశారని US ఆరోపిస్తోంది. ఈ కుట్రలో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.
Similar News
News January 12, 2026
ALERT: ఈ కోడ్స్తో కాల్స్ చేయొద్దు!

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.
News January 12, 2026
కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదు: SC

కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదని SC స్పష్టం చేసింది. ‘రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిని వారు కోరలేరు. వారి మధ్య వ్యత్యాసాన్ని తీసేస్తే ప్రభుత్వంలో నియామకాల ఉద్దేశం దెబ్బతింటుంది’ అని పేర్కొంది. నంద్యాల(AP) మున్సిపాల్టీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా మానవతా దృష్టితో వీరిని రెగ్యులర్ చేసే అవకాశాలను చూడాలని సూచించింది.
News January 12, 2026
మున్సిపల్ ఎన్నికలు.. మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

TG: మున్సిపాలిటీల్లోని తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించింది. కాగా ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.


