News October 30, 2025
కోహ్లీ జెర్సీ నంబర్తో బరిలోకి పంత్

గాయం నుంచి కోలుకున్న భారత క్రికెటర్ రిషభ్ పంత్ దక్షిణాఫ్రికా-Aతో అనధికారిక టెస్టు మ్యాచులో బరిలో దిగారు. ఈ క్రమంలో ఆయన ధరించిన జెర్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. కోహ్లీ జెర్సీ నంబర్ 18ని ధరించడమే దానికి కారణం. పంత్ జెర్సీ నం-17 కావడం గమనార్హం. అయితే పొరపాటున ఇలా జరిగిందా? లేదా కావాలనే ధరించారా? అనే విషయమై అభిమానుల్లో చర్చ నెలకొంది. కాగా కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 12, 2025
దారుణం.. ఉల్లి ధర కేజీ రూపాయి

మధ్యప్రదేశ్లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. మాల్వాలో నిన్న KG ఆనియన్ ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్సౌర్లో రూపాయికి పతనమైంది. భారీగా ఉల్లి నిల్వలు ఉండగా కొత్త పంట మార్కెట్లో రావడంతో ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. 30 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్కు తీసుకొచ్చేందుకు ₹2K చెల్లిస్తే.. క్వింటాల్కు ₹250 వచ్చిందని రత్లాం మార్కెట్లో మొఫత్లాల్ అనే రైతు వాపోయారు. ఉల్లికి MSP కల్పించాలని కోరుతున్నారు.
News November 12, 2025
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: CM

AP: ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తమ లక్ష్యమని CM చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి దీనిని సాకారమయ్యేలా చూస్తామన్నారు. అన్నమయ్య(D) దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మిగతా ఇళ్లు కూడా పూర్తి చేసి ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. YCP హయాంలో 4 లక్షలకు పైగా ఇళ్లను రద్దు చేశారని, ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.900కోట్లను ఎగ్గొట్టారని విమర్శించారు.
News November 12, 2025
సోషల్ మీడియా అకౌంట్లకు తల్లిదండ్రుల అనుమతి

మైనర్లు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చెయ్యడానికి వారి తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్ కన్సెంట్) ఉండాలని కేంద్ర సమాచారశాఖ విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టముసాయిదాలో నిబంధన చేర్చారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తల్లిదండ్రులు/ గార్డియన్ అనుమతి ఉంటేనే మైనర్లు సోషల్ మీడియా, ఈ-కామర్స్, గేమింగ్ యాప్లు వాడాలి. దివ్యాంగులకు కూడా గార్డియన్ సమ్మతి ఉండాలని చెబుతున్నారు.


