News November 19, 2025

PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

శ్రీకాకుళం: జిల్లాలో 57 ఉద్యోగాలకు నేడే లాస్ట్!

image

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 11నే గడువు ముగియగా 20వ తేదీకి పెంచారు. టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 20, 2026

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చేశారు: అనకాపల్లి DSP

image

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతేర్చిన ఘటన అనకాపల్లి(D) చీడికాడ(M) తూరువోలులో జరిగింది. కొండమ్మకు, గణేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. భర్త డేగల చిన్నకు ఇది తెలియడంతో అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం గణేశ్ తన స్నేహితుడితో కలిసి 14న బైక్‌తో గుద్ది చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. విచారణలో విషయం బయటపడగా నిందితులను అరెస్టు చేసినట్లు DSP శ్రావణి తెలిపారు.

News January 20, 2026

పోలవరం: అయ్యో.. ఈ పాపం ఎవరిది?

image

పోలవరం జిల్లా చింతూరు మండలంలో సోమవారం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లిదండ్రులు ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను కల్లేరు పంచాయతీ మధుగురు శివారున పొదల్లో పడేశారు. అటుగా వెళ్తున్న ఇద్దరు మహిళలకు కేకలు వినబడడంతో వెళ్లి చూడగా.. పొదల్లో ఆడ శిశువు ఉంది. వెంటనే ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.