News March 26, 2024

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్‌షోలతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News February 7, 2026

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

News February 7, 2026

మలేషియాకు బయలుదేరిన మోదీ

image

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ మలేషియా బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర తీర సహకారంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. అలాగే మలేషియాలోని భారతీయులను ప్రధాని ప్రత్యేకంగా కలవనున్నారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.

News February 7, 2026

T20 WC.. నేటి మ్యాచ్‌కు బుమ్రా దూరం!

image

T20 WCలో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరిగే <<19072262>>తొలి మ్యాచ్‌<<>>కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. నిన్న ఆయన గ్రౌండ్‌కు వచ్చినా ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు సుందర్ ఇంకా ఫిట్ కాకపోవడంతో భారత స్క్వాడ్‌లో 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆడే అవకాశం ఉంది.