News March 18, 2024

పెట్రో ధరలు మన దగ్గరే ఎక్కువ!

image

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.87గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.60గా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక రెండో స్థానంలో కేరళ(పెట్రోల్ రూ.107.54, డీజిల్ రూ.96.41), మూడో స్థానంలో తెలంగాణ(పెట్రోల్ రూ.107.39, డీజిల్ రూ.95.63) ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ విషయంలో కేంద్రం ఊరటనిస్తున్నా.. రాష్ట్రాల వ్యాట్ బాదుడు కారణంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.

Similar News

News December 6, 2025

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఓపెనర్ డీకాక్ సెంచరీ(106)తో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా 48, బ్రెవిస్ 29, బ్రీట్జ్‌కే 24 రన్స్‌తో రాణించగా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 271 రన్స్ అవసరం.

News December 6, 2025

రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

image

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

News December 6, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

image

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.