News April 27, 2024

నేరాలు-ఘోరాల్లో జగన్‌కు Ph.D: చంద్రబాబు

image

AP: నేరాలు, ఘోరాలు చేయడంలో సీఎం జగన్ పీహెచ్‌డీ చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘వైసీపీ పాలనలో రాష్ట్రం రాతియుగంలోకి పోయింది. వైసీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టో ఎంతో బెటర్. మేనిఫెస్టోలో రైతుల గురించి ఒక్క పథకం కూడా లేదు. జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కూటమి గెలిస్తే అభివృద్ధి.. వైసీపీ గెలిస్తే అరాచకం వస్తుంది. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 18, 2026

సభకు నేనొచ్చా.. వాళ్లు రాలేదు: రాఘవ్ చడ్ఢా

image

రాజ్యసభకు గైర్హాజరైన సొంత పార్టీ నేతలపై ఎంపీ రాఘవ్ చడ్ఢా విమర్శలు చేశారు. ‘మా పార్టీ సభా పక్షనేత ఇక్కడ లేరు. కొత్తగా నియమితులైన డిప్యూటీ లీడర్‌ కూడా రాలేదు. నన్ను డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఇటీవల తొలగించారు. నేను సభకు వచ్చాను. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులైన హరివంశ్ సింగ్‌కు అభినందనలు తెలిపారు.

News April 18, 2026

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

image

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం

News April 18, 2026

అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేస్తుంది: ట్రంప్

image

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాము స్తంభింపజేసిన నిధులను ఆ దేశానికి ఇవ్వబోమని స్పష్టంచేశారు. ‘యురేనియం శుద్ధిని ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. రెండు దేశాల మధ్య చాలా కీలక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వారాంతంలోనే శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి’ అని ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు.