News August 23, 2024

పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లతో పీఎం భేటీ

image

పోలాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి కబడ్డీ స్టార్స్‌తో తాజాగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన తెలిపారు. ‘వార్సాలో పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లు మికల్ స్పిజ్కో, అన్నా కల్బర్క్‌జిక్‌లను కలిశాను. ఆ ఆటను ఇక్కడి వారు చాలా ఇష్టపడుతుంటారు. పోలాండ్‌లో దాన్ని మరింతగా విస్తృతపరచడంపై, భారత్‌తో మరిన్ని టోర్నీలు ఆడటంపై వారితో చర్చించాను’ అని పీఎం వెల్లడించారు.

Similar News

News January 13, 2026

కోడి పందేలపై డ్రోన్ల వేట.. జూదగాళ్లకు SP వార్నింగ్

image

జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడలు పూర్తిగా నిషేధమని ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. పందాలు నిర్వహించినా లేదా ప్రోత్సహించినా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బరుల వద్ద నిఘా కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News January 13, 2026

వంటింటి చిట్కాలు

image

* వెండి వస్తువులు నల్లగా మారిపోతే వాటికి టమాటా కెచప్‌ రాసి, 15 నిమిషాల తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే తెల్లగా మెరుస్తాయి.
* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వేస్తే వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

News January 13, 2026

BHELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) హరిద్వార్‌లో 50 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 -27ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com