News February 9, 2025

వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌కు పోలీసుల నోటీసులు

image

AP: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఆఫీస్(జగన్ నివాసం కూడా అదే) వద్ద అగ్నిప్రమాదం జరగగా అక్కడి CC ఫుటేజీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తుకు ఫుటేజీ కీలకమని భావిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జగన్ భద్రతపై YCP ఆందోళన వ్యక్తం చేయగా, వాళ్లే తగలబెట్టుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని TDP మండిపడింది.

Similar News

News February 17, 2026

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

image

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.

News February 17, 2026

ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్‌కు మోదీ ఆహ్వానం

image

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

News February 17, 2026

భారత్‌తో ఓటమి.. నఖ్వీ కోపానికి పాక్ కోచ్ బలి?

image

టీమ్‌ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ కోచ్ మైక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రసిద్ధ ‘క్రికెట్ క్లబ్ కేఫ్’లో ఆయన కనిపించిన దృశ్యాలు SMలో వైరలవుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌పై PCB ఛైర్మన్ నఖ్వీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేపు నమీబియాతో మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే ఆ జట్టు ఇంటికెళ్లాల్సిందే. ఈ తరుణంలో కేఫ్‌లో మైక్ కనిపించడం చర్చకు దారితీసింది.