News May 15, 2024

పోలింగ్.. దేశంలోనే AP టాప్: ముకేశ్ కుమార్

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్‌లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో నమోదైందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66శాతం, మిగితా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైందన్నారు.

Similar News

News December 16, 2025

నేడు విజయవాడలో జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ విజయవాడ‌ జోజినగర్‌ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. 12PMకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జోజినగర్‌ వెళ్లి బాధితులతో మాట్లాడనున్నట్లు చెప్పింది. వారంతా ఇప్పటికే జగన్‌ను కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించారంది. ఈ క్రమంలో ఆయన నేరుగా ఘటనా స్థలికి వెళ్లి బాధితులను కలవనున్నారని పేర్కొంది.

News December 16, 2025

మంగళవారం ఈ పనులు చేయకూడదట..

image

హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఈ రోజు కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం వంటివి చేయరాదు. చేస్తే ఆయుష్షు తగ్గుతుంది. అలాగే, అంగారక ప్రభావం వల్ల కొత్త బట్టలు కొనడం, ధరించడం, కొత్త బూట్లు వేసుకోవడం మంచిది కాదు. మసాజ్ చేయించుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు, ఇంట్లో తగాదాలకు దారితీయవచ్చు’ అంటున్నారు.

News December 16, 2025

త్రివిక్రమ్.. కెరీర్‌లో తొలిసారి!

image

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్‌-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్‌ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.