News March 8, 2025
విజయవాడకు పోసాని తరలింపు

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు కర్నూలు జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. పీటీ వారెంట్పై ఆయనను అక్కడికి తీసుకెళ్తున్నారు. కాగా విజయవాడలోని భవానీపురం పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది. పీటీ వారెంట్పై ఆయనను అక్కడికి తీసుకువెళ్లేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు కర్నూలు నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.
Similar News
News January 16, 2026
కనుమ రోజున ఆవులను ఎందుకు పూజించాలి?

మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. ఆవు పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని విశ్వాసం.
News January 16, 2026
ఫరీదాబాద్లోని ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News January 16, 2026
బ్యాన్ ఉన్నా.. ప్రాణాలు తీస్తోంది

భారత్లో 2017లోనే చైనా మాంజా వినియోగం, తయారీపై NGT బ్యాన్ విధించింది. అయినా ఏటా సంక్రాంతి వేళ దేశంలో పదుల సంఖ్యలో <<18869437>>ప్రాణాలు<<>> తీస్తోంది. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అధిక ధరలకు విక్రయించొచ్చని ఢిల్లీ, హరియాణాలో ఎక్కువగా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇకనైనా కేంద్రం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


