News March 12, 2025
హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉండగా గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ కొట్టేయడంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.eximbankindia.in
News February 16, 2026
విత్తనాలు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సీల్ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయకూడదు. హైబ్రిడ్ విత్తనం( మొక్కజొన్న, మిరప పంటలకు) కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్ మీద సరిగా ఉన్నాయా, లేదా అని ఒకటికి రెండుసార్లు గమనించి కొనుగోలు చేయాలి.
News February 16, 2026
ఇంట్లో కర్పూరం వెలిగిస్తే…

కర్పూరానికి ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంటుందని పండితులు అంటున్నారు. రోజూ సాయంత్రం కర్పూరం వెలిగిస్తే ప్రతికూల శక్తి నశించి, సానుకూలత పెరుగుతుందని చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కర్పూరం చంద్ర, శుక్ర గ్రహాలకు ప్రతీక. దీన్ని వెలిగిస్తే పితృదోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కర్పూర సువాసన గాలిలోని బ్యాక్టీరియాను హరించి ఆరోగ్యకర వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.


