News November 7, 2025

PRG: సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి.. ఒకరి మృతి

image

పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నారీ జిల్లాకు చెందిన కార్మికుడు మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI మోహనకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 16, 2026

కాకినాడ: ‘కుక్కుట శాస్త్రం’ చెప్పిందే నిజమవుతోందా?

image

జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందేల్లో ‘కుక్కుట శాస్త్రం'(కోడి పురాణం) కీలకంగా మారింది. ఏ సమయంలో ఏ రంగు కోడి గెలుస్తుందో శాస్త్రంలో చెప్పినట్లే ఫలితాలు వస్తుండటంతో పందెంరాయుళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ఇష్టారాజ్యంగా పందేలు కాస్తున్నా, భారీగా బెట్టింగులు కట్టే వారు మాత్రం నక్షత్ర బలం, తిథి చూసుకొని బరిలోకి దిగుతున్నారు. దీనికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరిగింది.

News January 16, 2026

HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

image

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT

News January 16, 2026

ధురంధర్ నటికి చేదు అనుభవం

image

BMC ఎన్నికల్లో ధురంధర్ నటి సౌమ్యా టాండన్‌కు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కు సెలవు పెట్టి మరీ నిన్న ఓటు వేయడానికి వెళ్లారు. అయితే అధికారులు దాల్మియా కాలేజ్‌ బూత్‌లో వివరాల్లేవని ఆమెను మరో బూత్‌కు పంపడంతో అసహనం వ్యక్తం చేశారు. ‘ఓటు వేయడం నా హక్కు, బాధ్యత. ముందే స్క్రీన్ షాట్ తీసుకున్నా.. ఈ గందరగోళం ఏంటి? అసలు లిస్ట్‌లో నా పేరుందో లేదో చూడాలి’ అన్నారు. చివరకు ఓటేశారా లేదా అనే దానిపై స్పష్టతలేదు.