News June 20, 2024
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్లే: కిషన్ రెడ్డి

AP: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఫైల్ పెండింగ్లో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదన్నారు. ప్రజలు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ను కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. గనుల వేలంలో పాల్గొని విశాఖ స్టీల్ కూడా క్యాప్టివ్ మైన్స్ సొంతం చేసుకోవచ్చని తెలిపారు.
Similar News
News January 14, 2026
నేటి ముఖ్యాంశాలు

❃ తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంల పండగ విషెస్
❃ AP:అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి
❃ వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: సత్యకుమార్
❃ TG: గ్రామపంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల
❃ అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్లు, సిట్ల ఏర్పాటు: KTR
❃ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా
❃ కవిత కాంగ్రెస్లో చేరడం లేదు: పీసీసీ చీఫ్
❃ కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC
News January 14, 2026
పాలిటెక్నిక్లో కొత్త కోర్సులు!

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News January 14, 2026
పాలిటెక్నిక్లో కొత్త కోర్సులు ఇవే..

1)సెమీకండక్టర్స్ టెక్నాలజీ,
2)సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
3)ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్
4)ల్యాండ్ స్కేప్ డిజైన్, 5)బయోటెక్నాలజీ
6)కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్
7)సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
8)ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
9)అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ


