News April 9, 2024
పంజాబ్ టార్గెట్ 183 పరుగులు

IPLలో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో SRH 20 ఓవర్లలో 182/9 రన్స్ చేసింది. టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయిన సమయంలో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 64 రన్స్ చేసి SRH స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిగతా ప్లేయర్లు కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి SRHను దెబ్బ కొట్టగా.. హర్షల్ పటేల్, కర్రన్ చెరో 2 వికెట్లు, రబడ ఒక వికెట్ తీశారు.
Similar News
News March 26, 2025
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.
News March 26, 2025
శ్రేయస్ అయ్యర్.. కమ్బ్యాక్ సూపర్!

నిన్నటి IPL మ్యాచ్లో ప్లేయర్గా(97 రన్స్), కెప్టెన్గా పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.