News March 19, 2024

ఢిల్లీకి పురందీశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

image

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఢిల్లీకి వెళ్లారు. TDP-JSPతో పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే పొత్తుపై విమర్శలు చేస్తూ పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు రాసిన లేఖపైనా సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల లిస్టును విడుదల చేసి ప్రచారం ప్రారంభించాలని జాతీయ నేతలు యోచిస్తున్నారు.

Similar News

News December 14, 2025

రాయికోడ్: 4 ఓట్లతో WIN

image

రాయికోడ్ మండలంలో ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా BRS బలపరిచిని అభ్యర్థి బేగరి ఈశ్వరమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మానమ్మా మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.

News December 14, 2025

తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

image

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్‌లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.

News December 14, 2025

ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

image

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2019లో మెహర్‌ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్‌ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్‌ ‘భగవంత్‌ కేసరి’లో మెప్పించారు.