News December 3, 2024
త్వరలో పుతిన్ భారత్ పర్యటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733180122329_1032-normal-WIFI.webp)
వచ్చే ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష ఫారిన్ పాలసీ అడ్వైజర్ యూరీ యుషాకోవ్ తెలిపారు. త్వరలోనే పుతిన్ పర్యటన తేదీలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైనప్పుడు పుతిన్ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు. దీంతో మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఇక్కడికి వస్తున్నారు.
Similar News
News January 22, 2025
భారత్ పిచ్పై తేలిపోయిన RCB బ్యాటర్లు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737559167778_1032-normal-WIFI.webp)
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
News January 22, 2025
GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737550735422_746-normal-WIFI.webp)
హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.
News January 22, 2025
BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737564396301_367-normal-WIFI.webp)
తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.