News January 12, 2025
మళ్లీ వర్షాలు.. రైతుల్లో ఆందోళన
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రేపటి నుంచి 3రోజులు వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంట చేతికొచ్చే సమయంలో వానల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. కోతలు పూర్తయిన చోట ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ప్రకాశం, నెల్లూరు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 26, 2025
నేటి ముఖ్యాంశాలు
* 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* డా.నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్
* హైదరాబాద్ తెలుగు వారందరిది: ఏపీ సీఎం చంద్రబాబు
* జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR
* రేపు తెలంగాణలో 4 కొత్త పథకాలు ప్రారంభం
* ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి
* ఇంగ్లండ్పై రెండో టీ20లో భారత్ విజయం
News January 26, 2025
పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి
TG: పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్యవంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించినా పరిగణించకపోవడం తెలంగాణ ప్రజలందర్నీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి కనీసం 5 కూడా ఇవ్వకపోవడమేంటంటూ సీఎం ప్రశ్నించారు.
News January 26, 2025
‘పద్మ’గ్రహీతలకు అభినందనలు: చిరంజీవి
‘పద్మ’ పురస్కారాలు గెలుచుకున్న తెలుగువారికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘పద్మవిభూషణ్ గెలుచుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ పొందిన నా స్నేహితులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంత నాగ్, శేఖర్ కపూర్, శోభన, పద్మశ్రీ వచ్చిన అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణిశర్మ సహా పద్మ అవార్డీలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.