News March 3, 2025

RAMAZAN SPECIAL: ‘తరావీహ్‌’ నమాజ్‌..

image

పవిత్ర రంజాన్ మాసంలో ‘తరావీహ్‌’ నమాజ్‌ కు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజును ఉదయం (ఫజర్‌), మధ్యాహ్నం (జోహర్‌), సాయంత్రం 5 గంటలకు (అసర్‌), రాత్రి 6.30 గంటలకు (మగ్‌రీబ్‌), రాత్రి 8 గంటలకు (ఇషా నమాజ్‌) చేస్తారు. అయితే ఈ పవిత్ర మాసంలో ఇషా నమాజ్‌ తర్వాత, ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్‌లు ‘తరావీహ్‌’ నమాజ్‌ చేస్తారు. అదనపు పుణ్యం మూట కట్టుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం.

Similar News

News March 23, 2025

కష్టాల్లో ముంబై.. 6 వికెట్లు డౌన్

image

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13వ ఓవర్ ముగిసే సరికి 6వికెట్లు కోల్పోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా సాగుతోంది. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు ముంబై కష్టపడుతోంది. నూర్ 3, ఖలీల్ 2 వికెట్లు తీశారు. రోహిత్(0), రికెల్టన్(13), జాక్స్(11), సూర్య(29), తిలక్ వర్మ(31), రాబిన్(3) ఔటయ్యారు. 13 ఓవర్లకు MI స్కోర్ 96/6గా ఉంది.

News March 23, 2025

ముంబై టీమ్‌లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

image

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్‌ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.

News March 23, 2025

అనకాపల్లి జిల్లాలో లారీ బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

image

మాడుగుల మండలం గాదిరాయిలో ఓ ట్రాలీ లారీ ఆదివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. గాదిరాయి వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి 3 బైకులను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైకులపై వెళ్తున్న ఐదుగురు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ నారాయణరావు చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!