News August 3, 2024

రేవంత్‌ది ప్రజాపాలన కాదు.. పంజా పాలన: ప్రశాంత్‌రెడ్డి

image

TG: రేవంత్ సర్కార్‌ది ప్రజా పాలన కాదని ప్రతిపక్షంపై పంజా పాలన అని BRS నేత ప్రశాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. 7నెలల్లోనే ఆయన వికృత రూపం బయటపడిందని, ప్రజలకు ఈ దౌర్భాగ్యం కలిగినందుకు తాను బాధపడుతున్నానన్నారు. కాంగ్రెస్‌తో స్నేహపూర్వకంగా ఉన్న MIM MLA అక్బరుద్దీన్ కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సభలో అబద్ధాలు చెబుతూ కళ్లుండి చూడలేని కబోదిలా CM వ్యవహరిస్తున్నారన్నారు.

Similar News

News December 11, 2025

భారతీయులను పంపించడం సిగ్గుచేటు: ట్రంప్

image

అమెరికాలో టాప్ యూనివర్సిటీల్లో చదువు పూర్తిచేసుకున్న టాలెంటెడ్ ఇండియన్స్ దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఇది సిగ్గుచేటని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన కొత్త “<<18530951>>ట్రంప్ గోల్డ్ కార్డ్<<>>”ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆయన హైస్కిల్డ్‌ స్టూడెంట్స్‌కు ఉద్యోగం ఇచ్చి వారిని అమెరికాలోనే నిలుపుకోవడానికి ఇది కీలకమన్నారు. కంపెనీలు ఈ కార్డ్ కొనుగోలు చేయొచ్చని వివరించారు.

News December 11, 2025

పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలి: MP లావు

image

AP: రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను MP లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కేంద్రం AP పత్తి రైతులను ఆదుకోవాలి. ‘మొంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తేమశాతం ఎక్కువగా ఉన్న, రంగు మారిన పత్తిని కూడా CCI కొనుగోలు చేసేలా కేంద్రమే చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది.

News December 11, 2025

అఖండ-2 టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్

image

అఖండ-2 సినిమా <<18531616>>నిర్మాతలకు<<>> తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ మొదలవనుండగా ఇప్పటికే అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు.