News May 15, 2024

REWIND-2019: కరీంనగర్‌లో BJPకి 89,508 ఓట్ల మెజార్టీ!

image

కరీంనగర్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. బీ వినోద్ కుమార్(BRS)పై బండి సంజయ్ (BJP) 89,08,768 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. పొన్నం ప్రభాకర్(కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో రాజేందర్ రావు (కాంగ్రెస్), బండి సంజయ్(BJP), వినోద్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

Similar News

News December 12, 2025

కరీంనగర్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

కరీంనగర్ జిల్లాలో 5 మండలాల్లోని 92 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 81.82 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

KNR: చలి మంట కాగుతూ సిబ్బందితో సేదతీరిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం చలి తీవ్రత దృష్ట్యా కొద్దిసేపు సేదతీరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ, చలి మంట కాగుతూ ఆయన సిబ్బందితో కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

News December 11, 2025

ఫకీర్ పేట్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా విజయలక్ష్మి

image

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.