News November 19, 2025
RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.
Similar News
News January 19, 2026
‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ కన్నుమూత

యానిమేటెడ్ మూవీ ‘ది లయన్ కింగ్’(1994) కో-డైరెక్టర్ రోజర్ అల్లర్స్(76) మరణించారు. శాంటా మోనికాలోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీలో పలు చిత్రాలకు పని చేశారు. అలాద్దీన్(1992), ఓలివర్&కంపెనీ(1988), బ్యూటీ&ది బీస్ట్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు. ఆయన మరణంపై డిస్నీ CEO బాబ్ ఇగర్ విచారం వ్యక్తం చేశారు. వెటరన్ దర్శకుడికి నివాళులు అర్పించారు.
News January 19, 2026
మెదక్: మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి వివేక్

జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీలను నియమించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామికి బాధ్యతలు అప్పగించారు. మెదక్ పార్లమెంట్లో జరిగే మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలువు కోసం కృషి చేయాలన్నారు.
News January 19, 2026
భూపాలపల్లి: సర్పంచ్లకు ప్రారంభమైన ఓరియంటేషన్ శిక్షణ

జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సర్పంచులకు సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మంది రిసోర్స్ పర్సన్లు సర్పంచులకు విధివిధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐదు మండలాల నుంచి వచ్చిన 100 మంది సర్పంచులను రెండు బ్యాచ్లుగా విభజించి, ఐదు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం, నిధుల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.


