News November 6, 2025

RGM: రోజుకు 2.75లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తేనే టార్గెట్ రీచ్

image

సింగరేణి వ్యాప్తంగా(2025- 26) ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 11 డివిజన్లలో గడిచిన 7 నెలల్లో 32.64 MTల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇకపై టార్గెట్ రీచ్ కావాలంటే రోజుకు 2.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

Similar News

News January 24, 2026

సిరిసిల్ల: ‘చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం’

image

వాహనదారులు చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎస్పీ మహేశ్ బి.గితే అన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ‘Arrive-Alive’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డుపై పోలీసులు ఉన్నా, లేకున్నా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రమాదాల సమాచారం అందించాలని తెలిపారు. వాహనాలకు ప్రమాదాల నివారణ సూచనల స్టిక్కర్లు అతికించారు.

News January 24, 2026

గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలి: అదనపు కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని గోడౌన్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాలో సాంకేతిక ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News January 24, 2026

బాలికలను ఎగరనిద్దాం..

image

అమ్మాయిలు ప్రస్తుతం యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడటం ప్రధాన ఉద్దేశ్యం. కేవలం సమస్యల గురించే కాకుండా బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగం.