News November 7, 2025

RGM: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి: CI

image

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. NTPC పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచి ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో మంచి నడవడికతో ఉండాలని సూచించారు. NTPC- SIఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 16, 2026

2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

image

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.

News January 16, 2026

టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

image

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.

News January 16, 2026

కల్వకుర్తిని మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో జిల్లా చేయాలి

image

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తి, ఆమన్‌గల్ కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం బీజేపీ రాష్ట్ర నేత ఆచారి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.