News August 3, 2024
అర్ష్దీప్ సింగ్పై రోహిత్ ఆగ్రహం!

నిన్న గెలవాల్సిన మ్యాచ్ టై కావడంతో అర్ష్దీప్ సింగ్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ధోనీ స్టైల్లో ఫినిష్ చేసేందుకు వచ్చి, టై చేశారని కామెంట్స్ చేస్తున్నారు. బాల్స్ ఉన్నప్పటికీ అనవసర షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. అర్ష్దీప్ సింగ్పై కోప్పడినట్లు తెలుస్తోంది. పై ఫొటో చూసి, రోహిత్ ఏమని ఉంటారో కామెంట్ చేయండి.
Similar News
News December 12, 2025
3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.
News December 12, 2025
4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

TG: ఫుట్బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.
News December 12, 2025
PHOTO VIRAL: వరల్డ్ కప్ హీరోస్

టీమ్ఇండియా-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్లో జరిగిన ఓ సీన్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముల్లాన్పూర్ మైదానంలో తన పేరుతో స్టాండ్ ఓపెనింగ్ ఉండటంతో యువరాజ్ సింగ్ మ్యాచుకు వచ్చారు. ఈ సందర్భంగా టీమ్ఇండియా ఆటగాళ్లను కలిసి మాట్లాడారు. తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తోనూ కాసేపు సరదాగా గడిపారు. ‘2007, 2011 వరల్డ్ కప్ హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ వీళ్లిద్దరి ఫొటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.


