News December 31, 2024
క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోనున్న రోహిత్, కోహ్లీ?
టీమ్ ఇండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా BGT తర్వాత క్రికెట్ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు FEB 6 నుంచి ENGతో జరిగే ODI సిరీస్కు వీరు దూరం కానున్నట్లు తెలిపాయి. వర్క్ లోడ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, FEB 19 నుంచి జరగనుండగా, భారత్ 20న BANతో, 23న PAKతో తలపడనుంది.
Similar News
News January 15, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 15, 2025
ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్లో కోహ్లీ, పంత్ పేర్లు
రంజీ ట్రోఫీ నెక్ట్స్ రౌండ్లో ఆడేందుకు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ పేర్లను ఢిల్లీ జట్టు తమ ప్రాబబుల్స్లో చేర్చింది. అయితే ఈ ట్రోఫీకి కోహ్లీ అందుబాటులో ఉంటారా? లేదా? అనేదానిపై సెలక్టర్లు ఇప్పటివరకు ఆయనను సంప్రదించలేదు. చివరిసారి కోహ్లీ 2012లో రంజీ మ్యాచ్లో కనిపించారు. పంత్ 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఇటీవల రోహిత్ శర్మ కూడా ముంబై రంజీ టీమ్తో కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేశారు.
News January 15, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 15, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.18 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.