News February 6, 2025
బుమ్రా గాయంపై రోహిత్ UPDATE

స్టార్ పేసర్ బుమ్రా గాయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి 2 రోజులు స్కాన్స్ జరగాల్సి ఉందన్నారు. అందులో వచ్చిన రిజల్ట్స్ను బట్టి ఇంగ్లండ్తో మూడో వన్డే, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై క్లారిటీ వస్తుందని ప్రెస్మీట్లో చెప్పారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCAలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ENGతో ODI సిరీస్కు అతని స్థానంలో వరుణ్ను BCCI ఎంపిక చేసింది.
Similar News
News March 26, 2025
తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: సీఎం

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో, శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్లో ఉందని చెప్పారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ తలసరి ఆదాయం ఎక్కువని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
News March 26, 2025
SHOCK: మరికొన్ని రోజుల్లో ఆర్థికమాంద్యం!

2025 ద్వితీయార్థంలో ఆర్థికమాంద్యం వస్తుందని USలో మెజారిటీ కార్పొరేట్ ఫైనాన్స్ చీఫ్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, కన్జూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడమే ఇందుకు కారణమని CNBC CFO కౌన్సిల్ సర్వేలో అభిప్రాయపడ్డారు. మాంద్యం వస్తుందని 3 నెలల క్రితం 7% మంది అంచనా వేయగా ఇప్పుడీ సంఖ్య 60%కి చేరుకుంది. 2026లో ఆర్థిక వ్యవస్థ సంకోచం మొదలవుతుందని మరో 15% అంచనా వేశారు.
News March 26, 2025
గిల్ కెప్టెన్సీ బాలేదు: సెహ్వాగ్

PBKSతో మ్యాచ్లో GTకి శుభ్మన్ గిల్ చేసిన కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పెదవివిరిచారు. ‘పవర్ ప్లేలో సిరాజ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. గిల్ అతడిని ఆపి అర్షద్ను ఎందుకు తీసుకొచ్చాడు? అర్షద్ 21 పరుగులిచ్చాడు. అటు డెత్ ఓవర్ల కోసం పక్కన పెట్టిన సిరాజ్ కూడా ఆయా ఓవర్లలో రన్స్ సమర్పించుకున్నాడు. కెప్టెన్గా గిల్ క్రియాశీలంగా, వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపించలేదు’ అని స్పష్టం చేశారు.