News April 21, 2024

రేపు ఉండిలో RRR నామినేషన్

image

AP: ఉండి నియోజకవర్గ TDP MLA అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండి MRO ఆఫీసులో రేపు ఉ.10.30 గంటలకు తాను నామినేషన్ వేస్తానని RRR ట్వీట్ చేశారు. ఇందుకోసం పెదఅమిరంలోని స్వగృహం నుంచి భారీ ర్యాలీగా MRO ఆఫీసుకు బయల్దేరనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని RRR కోరారు. కాగా తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ MLA రామరాజుకు కేటాయించిన CBN.. చివరకు RRRకు ఫైనల్ చేశారు.

Similar News

News December 10, 2025

మొదలైన లారీల బంద్

image

TGలో లారీల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.

News December 10, 2025

ఎండినవారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.

News December 10, 2025

గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

image

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.