News April 22, 2024

మర్రి చెట్టు తొర్రలో రూ.66 లక్షలు దాచారు.. చివరికి ఏమైందంటే?

image

AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల ATMలో నగదు నింపే వ్యాన్ నుంచి రూ.66 లక్షలను దుండుగులు దోచుకెళ్లారు. ఇంటి దొంగలే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ఆ నగదును మర్రి చెట్టు తొర్రలో దాచినట్లు వారు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అక్కడికెళ్లి ఆ మొత్తాన్ని సీజ్ చేశారు.

Similar News

News December 6, 2025

ఆఫీస్ తర్వాత నో కాల్స్, ఈమెయిల్స్.. పార్లమెంటులో ప్రైవేట్ బిల్

image

పని వేళలు పూర్తయ్యాక, సెలవుల్లో ఆఫీస్ ఫోన్‌ కాల్స్, ఈమెయిళ్లను తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలంటూ NCP MP సుప్రియ లోక్‌సభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్-2025’లో ప్రతిపాదించారు. కాగా ఏదైనా అంశంపై చట్టం అవసరమని భావిస్తే MPలు బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తే బిల్లులను ఉపసంహరించుకుంటారు.

News December 6, 2025

బుమ్రాను ఉపయోగించుకోవడానికి బ్రెయిన్ కావాలి: రవిశాస్త్రి

image

SAతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్‌ ఇండియా బౌలింగ్‌లో ఫెయిల్ అవుతున్న వేళ జస్ప్రీత్‌ బుమ్రా వర్క్‌లోడ్‌పై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “బుమ్రా గ్రేట్ బౌలర్‌. అతడిని ఉపయోగించుకోవడానికి బ్రెయిన్‌ కావాలి” అంటూ జట్టు మేనేజ్‌మెంట్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కాగా ఇంగ్లండ్‌ టూర్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా.. ప్రస్తుతం జరుగుతున్న వన్డేల నుంచి రెస్ట్‌లో ఉన్నారు.

News December 6, 2025

గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలి: పవన్

image

AP: అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.