News April 11, 2024

రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 1/3

image

బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఈనెల 19న లోక్‌సభ తొలివిడత ఎన్నికలు జరగనున్న వేళ రాజ్‌బంశీయులు మరోసారి హైలెట్ అయ్యారు. ఎక్కువగా ఉత్తర బెంగాల్, దక్షిణ అస్సాంలో నివసించే వీరు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు తాము అనేక రాజ్యాలను జయించి వాటిని శాసించామని అంటున్నారు మహారాజ అనంత్ రాయ్. ఇంతకీ వీరి చరిత్రేంటి? ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఎందుకు వచ్చింది? <<-se>>#Elections2024<<>>

Similar News

News December 7, 2025

NRML: ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉండకూడదు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరగకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల అప్పీళ్లకు సంబంధించిన వివరాలను, మూడు దశల్లో దాఖలైన అన్ని నామినేషన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News December 6, 2025

నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

image

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.

News December 6, 2025

అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

image

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.