News December 1, 2025
SC కమిషన్ సెక్రటరీ కుమార్తె అనుమానాస్పద మృతి

రాష్ట్ర SC కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మాధురి అనుమానాస్పదంగా మృతి చెందారు. బేతంచెర్ల మం. బుగ్గానిపల్లె తండాకు చెందిన ఆమె రాజేశ్ నాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెను 3 నెలల క్రితం తల్లిదండ్రులు తీసుకెళ్లారని రాజేశ్ తెలిపారు. మరో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని, గర్భిణి అని చూడకుండా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేశ్ ఆరోపించడం సంచలనంగా మారింది.
Similar News
News February 10, 2026
ఇంకెన్నాళ్లు కల్తీ రాజకీయం: SV మోహన్ రెడ్డి

తిరుమల, శ్రీశైలం దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం కల్తీ అని ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ వివాదంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని, ఇంకెన్నాళ్లు ఈ కల్తీ రాజకీయం చేస్తారని ఆయన మండిపడ్డారు.
News February 10, 2026
ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు.. ఎస్పీ హెచ్చరిక

మున్సిపల్ ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే 123 కేసులు నమోదు చేసి సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 208 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. 30 కేసుల్లో రూ.1.57 లక్షల విలువైన 249 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News February 10, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్జోన్’లో కర్నూలు

కర్నూలు జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు. నంద్యాల జిల్లాలోనూ 10 నుంచి 12 శాతంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయి.


