News April 14, 2024
వైసీపీ పథకాల వెనుక కుంభకోణం: చంద్రబాబు

AP: జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను వస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ వస్తే గంజాయి వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. తన ప్రభుత్వంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని తెలిపారు. కేంద్రం సాయంతో ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Similar News
News December 15, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తూ బ్రహ్మే నిర్వహిస్తాడని నమ్మకం. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవాల్లో ముందు నడిచేది బ్రహ్మ రథమే. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. నారాయణుడికి సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు, హనుమంతుడు వంటి దేవతలు, పక్షులు, జంతువులు వాహన సేవ చేస్తాయి. ఇది ప్రకృతిలోని సర్వశక్తులు, సకల జీవులు స్వామివారికి సేవ చేయడాన్ని సూచిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 15, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News December 15, 2025
EVMలను నమ్మలేం: వైవీ సుబ్బారెడ్డి

ఏపీలో ఎన్నికల అక్రమాలపై ఈసీ విచారణ జరపాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్లలో అనేక తేడాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈవీఎంలను నమ్మలేమని, పేపర్ బ్యాలెట్పైనే అందరికీ నమ్మకం ఉందని రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు.


