News August 22, 2025

ముగిసిన నామినేషన్ల పరిశీలన.. బరిలో ఇద్దరే!

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలువురు దాఖలు చేసిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. అనంతరం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇద్దరే బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్టీఏ కూటమికే అత్యధిక మంది ఎంపీలు ఉండటంతో రాధాకృష్ణన్ గెలుపు లాంఛనం కానుంది.

Similar News

News January 13, 2026

తమిళ సంస్కృతిపై దాడి.. ‘జన నాయగన్’ జాప్యంపై రాహుల్

image

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలలో జాప్యంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చిత్రానికి అడ్డంకులు సృష్టించడం ‘తమిళ సంస్కృతిపై దాడి’ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ తమిళ ప్రజల గొంతును ఎప్పటికీ నొక్కలేరని Xలో పోస్ట్ చేశారు. దీనిపై BJP స్పందిస్తూ రాహుల్ అబద్ధాల కోరు అని.. గతంలో జల్లికట్టును ‘అనాగరికమైనది’గా పేర్కొన్న కాంగ్రెస్సే తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించింది.

News January 13, 2026

147పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్ (SAMEER) 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు JAN 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష FEB 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/

News January 13, 2026

షాక్స్‌గామ్‌పై పాక్-చైనా ఒప్పందం చట్టవిరుద్ధం: ఆర్మీ చీఫ్

image

షాక్స్‌గామ్ లోయలో చైనా చేపడుతున్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్-చైనా మధ్య 1963 నాటి ఒప్పందం చట్టవిరుద్ధం. CPEC 2.0పై ఆ దేశాల సంయుక్త ప్రకటనను మేము అంగీకరించం. అక్కడ ఎటువంటి కార్యకలాపాలకు భారత్ అంగీకరించదు. దీనిపై MEA ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది’ అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. కాగా కారకోరం శ్రేణికి ఉత్తరాన ఈ లోయ ఉంది.