News December 3, 2025
SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.
Similar News
News February 9, 2026
జగిత్యాల: ఎస్సారెస్పీ కెనాల్లో మృతదేహం లభ్యం

జగిత్యాల (R) మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ఎస్సారెస్పీ కెనాల్లో మృతదేహం లభ్యమైంది. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్కు చెందిన షేక్ నయీమ్ (43) గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. భార్యతో తరచూ గొడవలు జరగగా తల్లి వద్దనే ఉంటున్నాడు. ఈనెల 6న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నయీమ్ తిరిగి రాకపోవడంతో జగిత్యాల రూరల్ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. ఆదివారం నయీం శవం లభ్యమైంది.
News February 9, 2026
GWL: ఎన్నికల విధులకు ఎంతమంది పోలీసులంటే?

ఈనెల 11న గద్వాల జిల్లాలో జరిగే మూడు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల విధులకు 375 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5:00 ప్రచార సమయం ముగుస్తుందని ఆ తర్వాత ఎవరు ప్రచారం చేయరాదని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందన్నారు. వాటిని గ్రహించి అభ్యర్థులు నడుచుకోవాలన్నారు.
News February 9, 2026
పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.


